బ్రేకింగ్ : నవయుగపై ఐటీ దాడులు

Update: 2018-10-25 07:31 GMT

పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న నవయుగ కంపెనీపై ఐటీ శాఖ దాడులు చేస్తుంది. గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో నవయుగ కంపెనీకి సంబంధించిన మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. నవయుగ సంస్థకు చెందిన 47 కంపనీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఐటీ రిటర్ట్న్స్, ప్రాజెక్టుల నిర్వహణపై విచారిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కూడా ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్ తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్, కృష్ణ పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ వంటి సంస్థల లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Similar News