ఆన్ లైన్ బెట్టింగ్ లో ఈడీ సోదాలు

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, గుర్ గాం, ముంబై, పూణే లోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు [more]

Update: 2020-08-30 03:59 GMT

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, గుర్ గాం, ముంబై, పూణే లోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. నాలుగు హెచ్ఎస్ బీసీ బ్యాంకు ఖాతాల్లో రూ. 47 కోట్లు ఫ్రీజ్ చేసింది. 17 హార్డ్ డిస్క్ లు, 5 ల్యాప్ టాప్ లు, ఫోన్ లు, కీలక ఆధారాలు ఈడీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసుల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కామర్స్ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్ లు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. డాకీ పే కంపెనీ ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 1268 కోట్ల లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సీఏల సహకారంతో చైనీయులు భారత్ లో పలు కంపెనీలు సృష్టించినట్లు దర్యాప్తులో గుర్తించింది. మొబైల్ వాలెట్ లతో ఎక్కువగా లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఆన్ లైన్ వాలెట్ సంస్థలు, హెచ్ ఎస్ బీసీ, ఆర్వోసీ ల నుంచి సమాచారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సేకరిస్తుంది.

Tags:    

Similar News