కాంగ్రెస్ లో ముదురుతున్న విభేదాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో విభేదాలు ముదురుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ‌్రంట్ తో జట్టుకట్టడం పై సీనియర్ నేత [more]

Update: 2021-03-03 01:07 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో విభేదాలు ముదురుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ‌్రంట్ తో జట్టుకట్టడం పై సీనియర్ నేత ఆనందశర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని ఆనందశర్మ ఆరోపించారు. సిద్థాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అయితే దీనిపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ ఛౌదరి ఘాటు రిప్లై ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆనందశర్మ పక్కన పెట్టాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలు కూటమికి నేతృత్వం వహిస్తున్నాని ఆయన గుర్తు చేశారు. ప్రధానిని పొగిడి సమయం వృధా చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.

Tags:    

Similar News