బ్రేకింగ్ : గాంధీభవన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

Update: 2018-11-04 07:11 GMT

శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గాంధీభవన్ వ్ద ఆందోళనకు దిగారు. శేర్ లింగంపల్లి టిక్కెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ పునరాలోచించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీకి చెందిన సీటు టీడీపీ ఎందుకు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు శేరిలింగంపల్లి టిక్కెట్ ఇవ్వాలంటూ బిక్షపతి అనుచరులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కు దక్కకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Similar News