బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే ఆ రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని [more]

Update: 2020-03-10 06:13 GMT

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే ఆ రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పది రోజుల్లో రంగులు తొలగించి తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. చీఫ్ సెక్రటరీ చెప్పిన కొత్త రంగులను ప్రభుత్వ భవనాలకు వేయాలని హైకోర్టు సూచించింది. గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేశారని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు వైసీపీ రంగులు తొలగించడానికి ప్రభుత్వానికి పది రోజుల సమయం ఇచ్చింది. తీర్పును రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News