బ్రేకింగ్ : ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర హెచ్చరిక… ఇలాగయితే?

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగయితే కోర్టు థిక్కరణ [more]

Update: 2021-05-11 05:47 GMT

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగయితే కోర్టు థిక్కరణ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఎవరు అడ్డుకోమని చెప్పారని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీలో నిబంధనలను పాటించడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షలు చేయకుండా కేసులు తగ్గుతున్నాయని చెప్పడమేంటని హైకోర్టు నిలదీసింది. హైకోర్టు విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ లు హాజరయ్యారు.

Tags:    

Similar News