Dgp : బాబు, లోకేష్ లకు డీజీపీ లీగల్ నోటీసులు

డ్రగ్స్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుతో పాటు [more]

Update: 2021-10-13 05:29 GMT

డ్రగ్స్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తో పాటు ధూళిపాళ్ల నరేంద్ర మరికొందరు టీడీపీ నేతలకు డీజీపీ గౌతం సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉందని వీరు ఆరోపణలు చేశారు.

ఈనాడు, జ్యోతికి కూడా…

చంద్రబాబు, లోకేష్ లతో పాటు డీజీపీ గౌతం సవాంగ్ తప్పుడు కథనాలను ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా నోటీసులు పంపారు. దురుద్దేశపూర్వకంగానే నిరాధార ఆరోపణలు, తప్పుడు కథనాలు వచ్చాయని, దీనికి ఆధారాలను సమర్పించాలని డీజీపీ గౌతం సవాంగ్ తాను జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News