వైఎస్ఆర్ అభిమానులకు శుభవార్త

Update: 2018-09-12 11:36 GMT

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు శుభవార్త చెప్పింది ‘యాత్ర’ చిత్రం టీం. వైఎస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు, ఏసీ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డా.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.

Similar News