బ్రేకింగ్ : సభ నుంచి మిస్సయిన గాలి...!

Update: 2018-05-19 07:30 GMT

కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలకు టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాపగౌడ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. వీరు సభకు వస్తారని, మాకు మద్దతుగా ఉంటారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెబుతున్నా, వారు ఇంతవరకు సభకు రాలేదు. ప్రమాణస్వీకారానికి ప్రొటెం స్పీకర్ పిలిచినా వారు రాలేదు. అయితే, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి కూడా సభకు హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. గాలి ఎక్కడికి వెళ్లరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా, సభకు రాని ఇద్దరు శాసనసభ్యులను బీజేపీ వైపు తిప్పేందుకు గాలినే డీల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం వారు తాజ్ వెస్ట్ ల్యాండ్ హోటల్ లో ఉన్నారని, బలపరీక్ష సమయంలో వారిని వెంటబెట్టుకుని గాలి సోమశేఖర రెడ్డి సభకు వస్తారని తెలుస్తోంది.

Similar News