సుష్మాస్వరాజ్ మృతి

మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కన్నుమూశారు. నిన్న రాత్రి గుండెపోటుకు గురైన సుష్మాస్వరాజ్ ను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తున్న [more]

Update: 2019-08-07 01:45 GMT

మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కన్నుమూశారు. నిన్న రాత్రి గుండెపోటుకు గురైన సుష్మాస్వరాజ్ ను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తున్న సమయంలోనే గుండెపోటు తీవ్రం కావడంతో సుష్మాస్వరాజ్ మరణించారు. 67 ఏళ్ల సుష్మాస్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గత మోదీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా సేవలందించారు. మూడేళ్ల క్రితం సుష్మాస్వరాజ్ కు కిడ్నీ మార్పిడి జరిగింది. అప్పటి నుంచి ఆమె కొంత అనారోగ్యంతోనే ఉన్నారు. ఆరోగ్య కారణాల వల్లనే గత ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ పోటీకి దూరంగా ఉన్నారు. సుష్మాస్వరాజ్ నిన్న చివరిసారిగా మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కాశ్మీర్ విభజన అంశాన్ని ఆమె చివరి ట్వీట్ లో ప్రశంసించారు.

Tags:    

Similar News