బిగ్ బ్రేకింగ్ : అరుణ్ జైట్లీ కన్నుమూత

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందారు. ఎయిమ్స్ వైద్యులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో [more]

Update: 2019-08-24 07:13 GMT

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందారు. ఎయిమ్స్ వైద్యులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనెల 9వ తేదీ నుంచి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్చారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ లు ఇటీవలే పరామర్శించారు. ఏబీవీపి నుంచి అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం మొదలయింది. ఎమెర్జీన్సీలో జైలు జీవితం గడిపిన తర్వాత తర్వాత జనసంఘ్ లో చేరారు. 2001 నుంచి ఆయన బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో చేరనని ఆయనే స్వయంగా ప్రధాని మోదీకి వెల్లడించారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

Tags:    

Similar News