జగన్ కు భయపడేది లేదు… ఏం చేసుకుంటారో?

వైఎస్ జగన్ కు భయపడేది లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టకున్నా తాను సరెండ్ కాబోనని జేసీ దివాకర్ [more]

Update: 2020-06-17 06:37 GMT

వైఎస్ జగన్ కు భయపడేది లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టకున్నా తాను సరెండ్ కాబోనని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాపారాలను నాశనం చేయడానికే జగన్ పూనుకున్నారన్నారు. ఇప్పటికే తన ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని మూసి వేయించారన్నారు. తమ కుటుంబం రోడ్డున పడాలని జగన్ భావిస్తున్నట్టుందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయినా తాము భయపడేది లేదని, వ్యవసాయం చేసుకుని అయినా బతుకుతామని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి తమను లొంగదీసుకోవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి దిశగా జగన్ ఆలోచించడం లేదన్నారు.

Tags:    

Similar News