బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి మాజీ మంత్రి..?

Update: 2018-11-29 06:09 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ మంత్రి చేరికకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్ కుమార్ త్వరలో వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన ఆయనకు జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆయన డిసెంబర్ 3వ తేదీన భీమడోలులో తన అభిమానులతో సమావేశమై వైసీపీలో చేరిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Similar News