శ్రీలంకలో ఎమర్జెన్సీ.. తమిళనాడులో హైఅలెర్ట్

శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఆయన నిర్ణయించారు. ఈ రాత్రికి ఆయన [more]

Update: 2019-04-22 10:24 GMT

శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఆయన నిర్ణయించారు. ఈ రాత్రికి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఎమర్జెన్సీని ప్రకటించనున్నారు. ఈ అర్థరాత్రి నుంచే శ్రీలంకలో ఎమర్జెన్సీ అమలులోకి రానుంది. ఇక, తమిళనాడు తీర ప్రాంతంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు సముద్రమార్గాన తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉన్నందున తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News