ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ … గంటకు ఇంత

కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అందినంత మొత్తంలో దోచుకుంటున్నాయి . ఆస్పత్రికి వెళితే చాలు లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నాయి . గంటల వ్యవధి కె [more]

Update: 2021-04-26 01:27 GMT

కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అందినంత మొత్తంలో దోచుకుంటున్నాయి . ఆస్పత్రికి వెళితే చాలు లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నాయి . గంటల వ్యవధి కె వేల రూపాయల రూపాయలను కట్టించుకుంటున్నారు. ముందుగా బెడ్ లు లేవని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. బెడ్ ఇచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి అటుంచితే.. చిన్నాచితకా ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. బిల్లులు కట్టలేక బాధిత కుటుంబాలు దగ్గులు పెడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక రేట్లతో రేట్లలో వసూలు చేస్తున్నారు . ఎస్ ఆర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగు చూసిన మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా తో బాధపడుతున్న వృద్ధుడు తీవ్ర ఆయాసానికి గురయ్యాడు . దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని గంటల వ్యవధి చికిత్స కోసం 72 వేల రూపాయలు వసూలు చేశారు. అందులో 40 వేల రూపాయలు బెడ్ చార్జెస్ కింద కట్టించుకున్నారు. 24 గంటలు గడవకముందే డిశ్చార్జ్ చేసి 40 వేల రూపాయలు బేడ్ చార్జెస్ కింద వసులుచేశరని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స కింద 32 వేల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక మొత్తంలో ఆస్పత్రి వర్గాలు వసూలు చేస్తున్నాడు అంటూ బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు . చార్జీలు అధికంగా వసూలు చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News