తాగుబోతుల హల్ చల్ చూశారా…?

తాగుబోతు కుర్రోళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. పీకలదాకా మద్యం తాగి.. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేస్తూ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు ఆ [more]

Update: 2019-01-28 02:28 GMT

తాగుబోతు కుర్రోళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. పీకలదాకా మద్యం తాగి.. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేస్తూ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు ఆ యువకులు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 వైపు నుంచి కొండాపూర్ కు వెళ్తున్న కారు అదుపుతప్పింది. తాగిన మత్తులో స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. కొండాపూర్ కు చెందిన జయంత్, పవన్ లతో పాటు మరో వ్యక్తి కలిసి కారులో అర్థరాత్రి వేళ షికారుకు బయల్థేరారు. ఫుల్లుగా మందేయడంతో పాటు.. అతివేగంతో, అజాగ్రత్తతో నడపడం వల్ల కారు అదుపుతప్పింది. రోడ్లపై వెళ్లే జనం ప్రాణభయంతో ఎటువాళ్లటు పరుగులు తీశారు. కొద్దిసేపటికే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఓ మెట్రో పిల్లర్ ను కారు ఢీకొంది.

బెలూన్లు తెరుచుకోవడంతో….

ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ఉన్న తాగుబోతు కుర్రోళ్లు ముగ్గుర్ని మాదాపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. తాను ఓ పోలీసు అధికారి బంధువని రెచ్చిపోయాడు తాగి గాయపడ్డ జయంత్. అయితే కారు తాను నడపలేదని.. పవన్ అనే వ్యక్తి నడిపాడంటూ పోలీసులకు చెప్తున్నాడు జయంత్. కారు నడిపిందెవరనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. అక్కడి నుంచి కారును తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.

Tags:    

Similar News