ఏపీని వదలని కోయంబేడు.. కరోనా కేసులు మూడువేలకు దగ్గరగా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2,841 కేసులు నమోదయినట్లయింది. [more]

Update: 2020-05-28 06:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2,841 కేసులు నమోదయినట్లయింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదయిన కేసుల్లో నాలుగు కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఏపీలో 1,958 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 824 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనా కారణంగా 59 మంది మృతి చెందారు.

Tags:    

Similar News