టీడీపీపై కరోనా ఎఫెక్ట్.. ప్రచారంలో భయం భయంగా

తెలుగుదేశం పార్టీకి కరోనా భయం పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ నేతలకు కరోనా సోకడంతో వారు అర్థాంతరంగా ప్రచారం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే [more]

Update: 2021-04-11 01:03 GMT

తెలుగుదేశం పార్టీకి కరోనా భయం పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ నేతలకు కరోనా సోకడంతో వారు అర్థాంతరంగా ప్రచారం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారంతా చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం వంగలపూడి అనిత, సంధ్యారాణి చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags:    

Similar News