పోలీసులకు కరోనా భయం.. ఐదుగురు సిబ్బందికి?

కరోనా మహమ్మారిపై పోరాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులను కూడా వైరస్ వదలట్లేదు. ఇప్పటికే కరోనాతో తెలంగాణలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు తెలియడంతో [more]

Update: 2020-05-23 07:07 GMT

కరోనా మహమ్మారిపై పోరాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులను కూడా వైరస్ వదలట్లేదు. ఇప్పటికే కరోనాతో తెలంగాణలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు తెలియడంతో కలకలం రేగింది. తాజాగా.. మరో ఐదుగురు పోలీసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వడంతో విధులకు రావడానికి పోలీసులు జంకుతున్నారు. హైదరాబాద్‌ పోలీసు శాఖలో ఐదుగురు పోలీసులకు కరోనా సోకింది. ఇవాళ హైదరాబాద్ సిటీ లోని ఒక పోలీస్ స్టేషన్ ఎస్సైకి పాజిటివ్ అని తేలింది. ఆ ఎస్సై కుటుంబీకులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలియవచ్చింది. ఆయనతో పాటు నాలుగు స్టేషన్లలో విధులు నిర్వహించే నలుగురు పోలీసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇవాళ మొత్తం ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Tags:    

Similar News