నేడు మరోసారి భేటి… నిన్న లెక్క తేలనందుకేనా?

రాజస్థాన్ లో మరోసారి ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా మరోసారి సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ కోరనుంది. [more]

Update: 2020-07-14 03:09 GMT

రాజస్థాన్ లో మరోసారి ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా మరోసారి సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ కోరనుంది. ఇప్పటికే సచిన్ పైలెట్ ను బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం రంగంలోకి దిగారు. నిన్న సీఎల్పీ సమావేశానికి 84 మంది మాత్రమే హాజరయ్యారంటున్నారు. 107 మందిలో 84 మంది హాజరుకావడంతో మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సచిన్ పైలెట్ వర్గంగా 19 మంది వరకూ ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయితే నేడు సీఎల్పీ భేటీకి సచిన్ పైలెట్ వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News