పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సభ్యులుగా తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ ఎన్నికయ్యారు. సీఎం రమేష్ కు అన్నా డీఎంకే, సీపీఎం, సీపీఐతో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఓట్లు వేయడంతో ఆయన 107 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీజేపీ ఎంపీ భపేంద్ర యాదవ్ 69 ఓట్లు సాదించి గెలుపొందారు. ఇక జేడీయూ అభ్యర్థి మాత్రం ఓటమి చవిచూశారు.