చింతమనేనికి సీరియస్ వార్నింగ్

Update: 2018-11-17 07:17 GMT

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని ప్రభాకర్ వినడం లేదని సీనియర్ నేతల ముందు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండటంతో పార్టీని ఇబ్బందులు పాల్జేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం పనిచేస్తేనే సరిపోదని, వ్యక్తిగత ఇమేజ్ కూడా అవసరమని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకుంటే తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల చింతమనేని తన వర్గీయులతో కలసి వైసీపీ నేతపై దాడిచేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Similar News