ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారు?

తెలుగుదేశం పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడలేకనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ [more]

Update: 2021-02-28 07:51 GMT

తెలుగుదేశం పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడలేకనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని, ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ దాడులపై ఎన్నికల కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బెదిరింపులకు గురి చేసి టీడీపీ అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News