జగన్ చేతకానితనంతో ఏపీ పరువు పోయింది

జగన్ చేతకాని తనంతో ఏపీ పరువు, ప్రతిష్ట మంటగలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రైతుల పాలిట ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండలుగా [more]

Update: 2020-09-05 05:56 GMT

జగన్ చేతకాని తనంతో ఏపీ పరువు, ప్రతిష్ట మంటగలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రైతుల పాలిట ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండలుగా మారాయని చంద్రబాబు తెలిపారు. మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ఎక్కువగా రాయలసీమ ప్రాంత రైతులు నష్టపోతారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని, రైతులు పోరాడి సాధించుకున్నారని చంద్రబాు తెలిపారు. నాలుగు నెలల్లోనే 80 శాతం అప్పులు చేశారని జగన్ పై విమర్శలు చేశారు. జగన్ గంటకు 9 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News