నా అండ మీకు ఎప్పుడూ ఉంటుంది.. కొనసాగించండి

రాజధాని రైతులకు తెలుగుదేశం అండగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 150వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. రాజధానిని [more]

Update: 2020-05-15 06:46 GMT

రాజధాని రైతులకు తెలుగుదేశం అండగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 150వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 150 రోజులుగా రైతులు మొక్కవోని ధైర్యంతో ఉద్యమం చేయడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. ఉద్యమం మీద కులముద్ర వేశారని, అరెస్ట్ లు చేశారని, అవమానాలు చేశారని అయినా రైతులు తమ పోరాటాన్ని కొనసాగించడం స్ఫూర్తిదాయకమన్నారు. 33 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. కోట్లాదిరూపాయల రైతులు ఇచ్చిన ఆస్తిని ఈ ప్రభుత్వం మట్టిపాలు చేస్తుందని మండి పడ్డారు. విధ్వంసకుల చేతికి పాలన రావడం వల్లనే ఈ దుస్థితి అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News