సమర్థవంతంగా..సమిష్టిగా ఎదుర్కొనండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడారు. ఏనాడూ [more]

Update: 2020-03-07 07:01 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడారు. ఏనాడూ ఎన్నికలంటే టీడీపీ భయపడలేదని చెప్పారు. ఈ ఎన్నికలను కూడా అందరూ సమిష్టిగా సమర్థవంతంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ఎక్కడకక్కడ ఎదుర్కొనాలని చెప్పారు. మద్యం, డబ్బు పంపిణీకి వైసీపీ నేతలు పాల్పడితే వాటిని వీడియో తీయాలని కూడా చంద్రబాబు నేతలకు సూచించారు. ఎవరూ భయపడాల్సిన పనలేదని, న్యాయస్థానాలున్నాయని చంద్రబాబు ధైర్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీికి బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News