ఎవరూ అధైర్య పడొద్దు….విశాఖకు త్వరలోనే వస్తా

విశాఖపట్నానికి తాను త్వరలోనే వస్తానని, అక్కడ పర్యటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి విశాఖకు వస్తే ఎవరు [more]

Update: 2020-02-28 05:08 GMT

విశాఖపట్నానికి తాను త్వరలోనే వస్తానని, అక్కడ పర్యటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి విశాఖకు వస్తే ఎవరు అడ్డుకుంటారో చూస్తానని తెలిపారు. ఎన్నిసార్లు అడ్డుకున్నా తాను విశాఖకు వచ్చి తీరుతానని, అక్కడ పర్యటిస్తానని నేతలకు స్పష్టం చేశారు. విశాఖలో తనను అడ్డుకోవడం వెనక పోలీసుల కుట్ర కూడా ఉందన్నారు. వైసీపీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్దకు పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తనపై దాడి చేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని చంద్రబాబు నిలదీశారు. వైసీపీకి పోలీసులు పూర్తి సహకారం అందించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరూ అధైైర్య పడవద్దని, త్వరలోనే తాను విశాఖలో పర్యటిస్తానని చంద్రబాబు నేతలకు భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News