బ్రేకింగ్ : అరగంట సేపు నుంచి చంద్రబాబు ఎయిర్ పోర్టు వద్దే?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. [more]

Update: 2020-02-27 06:38 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. కొందరు చంద్రబాబుపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ చోటు చేసుకుంది. చంద్రబాబు ఎదుట పెద్దయెత్తున నిరసనను తెలియజేశారు. అయితే అంతే దీటుగా టీడీపీ కార్యకర్తలు కూడా వారి నిరసనను అడ్డుకోవడంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ దాదాపు అరగంట సేపు నుంచి ఎయిర్ పోర్టు వద్దనే ఉండిపోయింది.

Tags:    

Similar News