బాబు సన్నిహితులే టార్గెట్

టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులే టార్గెట్ గా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు [more]

Update: 2020-02-07 12:57 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులే టార్గెట్ గా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు ముగిసినా చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో జరిగిన లావాదేవీలపై ప్రధానంగా శ్రీనివాస్ ను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా చూస్తే ఐటీ దాడులు ఇన్నిరోజులు జరగవు. రెండు రోజులుగా హైదరాబాద్, కడప, విజయవాడలో లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారంటే రాజకీయంగా ఆర్థిక లావాదేవీలు జరిపారంటున్నారు. నిన్న ఉదయం ఈ దాడుల్లో ఈడీ, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.

Tags:    

Similar News