జగన్ మీడియా గొంతు నొక్కేస్తున్నారు

న్యూస్ ఛానళ్లను నిలిపేయడం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్యం గొంతునొక్కడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బాధితుల బాధలను ప్రసారం చేశారని ఆ ఛానళ్లను నిలిపేయడం [more]

Update: 2019-09-13 08:11 GMT

న్యూస్ ఛానళ్లను నిలిపేయడం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్యం గొంతునొక్కడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బాధితుల బాధలను ప్రసారం చేశారని ఆ ఛానళ్లను నిలిపేయడం అమానుషమని చంద్రబాబు అన్నారు. సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తమకు ఏ ఛానల్ కావాలో వినియోగదారుడు నిర్ణయించు కుంటారన్నారు. ట్రాయ్ నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కినట్లే మీడియా గొంతును జగన్ నొక్కేస్తున్నారన్నారు.

Tags:    

Similar News