Chandrababu : కోర్టులంటే జగన్ కు లెక్కలేనితనం

న్యాయస్థానాలు చెప్పినా జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. [more]

Update: 2021-10-12 08:58 GMT

న్యాయస్థానాలు చెప్పినా జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఉపాధి హామీ పధకం కింద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని కోర్టు ఆదేశించినా జగన్ ప్రభుత్వం లెక్క చేయడం లేదని చంద్రబాబు అన్నారు. న్యాయస్థానాలు అంటే జగన్ కు లెక్క లేకుండా పోయిదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతా వారే…..

ఏలూరులో రంజత్ అనే కాంట్రాక్టర్ బిల్లులు రాక ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలు వారు మాత్రమే ఉన్నారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News