అవసరమైతే కేసీఆర్ కే 500 కోట్లు ఇస్తా

హైదరాబాద్ కంటే ఎక్కువ అమరావతి అభివృద్ధి చెందుతుందని కుళ్లుతో కేసీఆర్.. జగన్ తో కలిసి కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఆయన పుట్టపర్తిలో [more]

Update: 2019-03-28 08:59 GMT

హైదరాబాద్ కంటే ఎక్కువ అమరావతి అభివృద్ధి చెందుతుందని కుళ్లుతో కేసీఆర్.. జగన్ తో కలిసి కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఆయన పుట్టపర్తిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… ఒక్క పైసా జేబులో నుంచి పెట్టకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా నగరాన్ని నిర్మిస్తున్నానని అన్నారు. తమ దగ్గర డబ్బులు లేవనుకొని కేసీఆర్ 500 కోట్లు బిక్షం వేయాలనుకున్నారని అన్నారు. తమవే లక్ష కోట్ల ఆస్తి కొట్టేసి 500 కోట్లు బిక్షమేస్తానన్నారని అన్నారు. కేసీఆర్ బిక్షం తనకు అవసరం లేదని, అవసరమైతే తానే కేసీఆర్ కు 500 కోట్లు ఇస్తానన్నారు. బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేస్తే కేసీఆర్ కొట్టేశారని ఆరోపించారు. కట్టుబట్టలతో తమను పంపించేశారన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపేయాలని నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. జగన్ కు నరేంద్ర మోడీ, కేసీఆర్ వేల కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News