నిరుద్యోగ భృతి డబుల్ : చంద్రబాబు

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్లను రెట్టింపు చేసిన ఆయన ఇప్పుడు నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని భావిస్తున్నారు. [more]

Update: 2019-01-31 09:49 GMT

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్లను రెట్టింపు చేసిన ఆయన ఇప్పుడు నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1000ని రూ.2000కు పెంచుతూ ఇవాళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుటామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఈ పెంచిన నిరుద్యోగ భృతిని అందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News