జగన్ బరితెగించారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బరితెగించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా మీద కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ [more]

Update: 2019-10-31 13:39 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బరితెగించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా మీద కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ మించిపోయాడన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ జీవో తెచ్చి తిరిగి వెనక్కు తీసుకున్నారన్నారు. వైసీపీ వాళ్లను ఇలా వదిలేస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారన్నారు. ఇది జాతీయ సమస్య అని, దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు. ఇక రాజధాని విషయంలో సింగపూర్ కన్సార్టియంను కూడా వెనక్కు పంపడం పిచ్చికి పరాకాష్ట అని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ చూసే పరిస్థితి లేదన్నారు. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నవంబరు 1వ తేదీన జరపడేమింటని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News