యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కేంద్రం

పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి [more]

Update: 2019-02-16 06:53 GMT

పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. పుల్వామా దాడి గురించిన వివరాలను రాజ్ నాథ్ సమావేశంలో వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ పార్టీల సూచనలు ఆయన తీసుకుంటున్నారు. హోంశాఖ, ఐబీ, రా ఇచ్చిన నివేదికలను ఆయన అఖిలపక్ష నేతల ముందుంచుతారని తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు కేంద్రానికి ఉన్న ఆలోచనలను రాజ్ నాథ్ తెలియజేయనున్నారు.

Tags:    

Similar News