నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. లాక్ డౌన్ పై?

నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం  12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్ డౌన్, [more]

Update: 2020-04-06 04:31 GMT

నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్ డౌన్, కరోనా నివారణ చర్యలపై నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. లాక్ డౌన్ తో రాష్ట్రాల పరిస్థితిపై చర్చించనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ యా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News