బ్రేకింగ్ : రాయపాటిపై సీబీఐ

మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి సీబీఐ సోదాలు చేస్తుంది. రాయపాటి సాంబశివరావు చెందిన కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ఇండియన్ [more]

Update: 2019-12-31 04:12 GMT

మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి సీబీఐ సోదాలు చేస్తుంది. రాయపాటి సాంబశివరావు చెందిన కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ఇండియన్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయల రుణం ఇండియన్ బ్యాంకు నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తీసుకుంది. ఈ తీసుకున్న రుణానికి సంబంధించిన డబ్బులు తిరిగి కంపెనీ చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇండియన్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది ఈ మేరకు కంపెనీ ఎండి చైర్మన్ తో పాటుగా మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి సీబీఐ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ ,విజయవాడ, గుంటూరు తో పాటుగా ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. .

Tags:    

Similar News