రాజధానిపై ఎవరికీ అనుమానాలొద్దు: బొత్స

రాజధాని అమరావతిలో అంతా గందరగోళంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలో 35వేల కోట్ల విలువైన పనులను టెండర్లు పిలిచారన్నారు. కానీ వాటికి బ్యాంకు [more]

Update: 2019-08-29 14:12 GMT

రాజధాని అమరావతిలో అంతా గందరగోళంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలో 35వేల కోట్ల విలువైన పనులను టెండర్లు పిలిచారన్నారు. కానీ వాటికి బ్యాంకు గ్యారంటీ లేదన్నారు. రాజధాని పై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవని బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమీక్ష అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాజధాని కౌలు రైతులకు రేపటి నుంచి చెక్కులు పంపిీణీ చేస్తామని, అర్హులైన వారికి మాత్రమే పంపిణీ చేస్తామని బొత్స సత్యనాార‍యణ తెలిపారు. రాజధానికి సంబంధించి 43వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని బొత్స వెల్లడించారు. శ్రీభరత్ తమ భూముల పై చేసిన వ్యాఖ్యలను సీఆర్డీఏ తప్పు పట్టిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు.

Tags:    

Similar News