రేపు అరగంట చీకట్లో జగన్

Update: 2018-04-23 13:27 GMT

రేపు అరగంట పాటు చీకటిలో ఉందామని వైసీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చాయి. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 24వ తేదీన ఏపీ లోని 13 జిల్లాల్లో రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్తును నిలిపివేసి నిరసన తెలియజేయాలని ఈ పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నెల 24వ తేదీన బ్లాక్ డే గా పాటించాలని ఆ పార్టీలు ప్రజలను కోరాయి. వైసీపీకి చెందిన నేతలందరూ ఈ బ్లాక్ డే లో పాల్గొనాలని అందరికీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జగన్ కూడా తన శిబిరంలో బ్లాక్ డే ను రేపు పాటించనున్నారు.

Similar News