బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ కు ఊరట..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. [more]

Update: 2019-03-25 10:25 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఆంధ్రప్రదేశ్ వేసిన స్టే పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రెండున్నర నెలల క్రితం సీఐ ఉద్యోగానికి గోరంట్ల మాధవ్ స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. అయితే, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో గోరంట్ల మాధవ్ అభ్యర్థిత్వంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మాధవ్ పోటీ చేయడం కుదరకపోతే ఆయన భార్య సవితను పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మాధవ్ హిందూపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఉండటం ఖాయమైంది.

Tags:    

Similar News