భర్త ఆరోగ్యంపై ఆందోళనతో భువనేశ్వరి?

విశాఖ ఎయిర్ పోర్టులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి కలిశారు. ఉదయం నుంచి చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులోనే ఉండటంతో ఆందోళన చెందిన [more]

Update: 2020-02-27 12:22 GMT

విశాఖ ఎయిర్ పోర్టులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి కలిశారు. ఉదయం నుంచి చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులోనే ఉండటంతో ఆందోళన చెందిన భువనేశ్వరి హుటాహుటిన విశాఖకు వచ్చినట్లు సమాచారం. ఎయిర్ పోర్టులో లాంజ్ ఉన్న చంద్రబాబును భువనేశ్వరి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఏడు గంటల నుంచి చంద్రబాబు ఆహారం లేకుండా ఉండటంతో భువనేశ్వరి ఆందోళన చెందారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎయిర్ పోర్టు లాంజ్ లోనే భువనేశ్వరి కలసి మాట్లాడినట్లు టీడీపీ నేతలు చెప్పారు.

Tags:    

Similar News