సంజయ్ అరెస్ట్ కు నిరసనగా

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బీజేపీ శ్రేణులు నేడు ఆందోళనకు దిగనున్నాయి. బండి సంజయ్ కరీంనగర్ లోని తన పార్టీ కార్యాలయంలో [more]

Update: 2020-10-27 04:52 GMT

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బీజేపీ శ్రేణులు నేడు ఆందోళనకు దిగనున్నాయి. బండి సంజయ్ కరీంనగర్ లోని తన పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, క్రిమినల్ కేసులు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ, యువమోర్చా నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ప్రగతి భవన్, టీఆర్ఎస్ భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు నేడు బీజేపీ నేతలు గవర్నర్, ఎన్నికల కమిషనర్ ను కలవనున్నారు. దుబ్బాక సంఘటన గురించి వివరించనున్నారు.

Tags:    

Similar News