జగన్ కేసులో….?

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విచారించేందుకు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం చేరకున్న ఎన్ఐఏ [more]

Update: 2019-01-05 04:29 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విచారించేందుకు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం చేరకున్న ఎన్ఐఏ అధికారులు కేసు వివరాలను, ఆధారాలను అప్పగించాలని స్థానిక పోలీసులను కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తాము వివరాలు అందించలేమని విశాఖ పోలీసులు తెలిపారు. దీంతో ఎన్ఐఏ అధికారులు ఏం చేస్తారన్నది అర్థం కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద హైకోర్టు ఆదేశించినా స్థానిక పోలీసులు ఎన్ఐఏ విచారణకు సహకరించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News