బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జగన్ పై హత్యాయత్నం

Update: 2018-10-25 07:39 GMT

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై దాడి జరిగింది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర పూర్తిచేసుకుని హైదరాబాద్ రావడానికి విశాఖపట్నం వచ్చిన జగన్ ఎయిర్ పోర్టులోని లాంజ్ లో కూర్చుని ఉండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. కత్తి తో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి వెయిటర్ శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ దాడిలో జగన్ గాయాలపాలయ్యారు. భుజం నుంచి జగన్ కు రక్తం కారుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News