ధర్మపురిలో దొరికిపోయిన ఏపీ పోలీసులు

Update: 2018-10-27 12:05 GMT

జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిన్న సాయంత్రం టీఆర్ఎస్ ప్రచారంలో ఉండగా కొంతమంది అనుమానాస్పదంగా కనపడగా టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వీరిని పోలీసులు ప్రశ్నించగా మొదట ఏమీ చెప్పలేదని, తర్వాత వారు ఏపీ పోలీసులుగా అంగీకరించారని తెలిపారు. వీరిలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారని, వారి పేర్లు నారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, మధుబాబు అని, వీరి గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇవాళ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే, టీఆర్ఎస్ ఏపీ పోలీసులు తెలంగాణలో మోహరించారని ముందునుంచీ ఆరోపణలు చేస్తూ వస్తుండగా, ధర్మపురంలో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Similar News