అందుకే తెలంగాణలో మా పోలీసులున్నారు

Update: 2018-10-30 12:03 GMT

మావోయిస్టుల జాడపై సమాచారం ఉన్నందునే తెలంగాణకు తమ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కోసం వెళ్లారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలకు పట్టుపడ్డారు. వీరు ఓటర్లకు నగదు పంచుతున్నారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ డీజీపీకి ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చిన డీజీపీ... మావోయిస్టుల గురించి సమాచారం ఉన్నందున విచారణ కోసం తమ ఇంటెలిజెన్స్ అధికారులు జగిత్యాల వెళ్లారని తెలిపారు. విచారణ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడికైనా వెళ్లవచ్చని వివరించారు. తమ సిబ్బంది డబ్బు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. తమకు తెలంగాణలో ఇంకా ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని గుర్తు చేశారు.

Similar News