బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల అధికారి బదిలీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్.పి.సిసోడియాను బదిలీ చేస్తూ కొత్త ఎన్నికల [more]

Update: 2019-01-17 11:50 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్.పి.సిసోడియాను బదిలీ చేస్తూ కొత్త ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితా పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, బోగస్ ఓట్లు పెద్దసంఖ్యలో చేర్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News