బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి ఎంపీ రాజీనామా

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత [more]

Update: 2019-02-14 06:16 GMT

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. త్వరలో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ లు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సిట్టింగ్ ఎంపీనే టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి మింగుడు పడని వ్యవహారమే. అవంతితో పాటు మరో ఎంపీ, ఒక ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News