కాంగ్రెస్ కు మరో షాక్

Update: 2018-09-10 12:41 GMT

ముందస్తు ఎన్నికల వేడితో తెలంగాణలో కప్పల తక్కెడ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే పొత్తుల అంశం కాంగ్రెస్ కి సైతం ఇబ్బందిగా కనిపించే అవకాశం కనపడుతోంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఇంచుమించు ఖరారు అయిపోయింది. దీంతో తమకు పొత్తుల వల్ల టిక్కెట్ దక్కదని భావిస్తోన్న వారు కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి ఈసారి కూడా పోటీ చేయాలని భావించారు. అయితే, పొత్తులో భాగంగా టీడీపీ ఉప్పల్ స్థానం కచ్చితంగా కావాలని పట్టుబడుతోంది. ఇక్కడి నుంచి పార్టీ ముఖ్య నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ఉప్పల్ స్థానాన్ని టీడీపీకి వదిలేస్తారనే అంచనాకు వచ్చిన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యి ఈ నెల 12న టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు.

Similar News