పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నా

పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. అయితే ఈసందర్భంగా [more]

Update: 2021-03-18 00:58 GMT

పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. అయితే ఈసందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చెప్పారు. వరదలు వచ్చే సమయంలోగానే స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్, గేట్లు అన్ని పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. గోదావరి నీటిని స్పిల్ వే ద్వారా దిగువనకు మళ్లించేందుకు ప్రయత్నిస్తామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మొన్నటి వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. కాపర్ డ్యాం పనులు పూర్తయ్యాక డయా ఫ‌్రం వాల్ కు మరమ్మత్తులు చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News